తమిళ హీరో తలపతి విజయ్ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీలో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ధృవీకరించేశారు. తమిళనాట పొత్తులు లేకుండా ఒక కొత్త పార్టీ ఒంటరిగాఎన్నికల బరిలోకి దిగడం సాహసమనే చెప్పాలి. అయితే తన అభిమానుల బలంతో తమిళ రాజకీయాలలో సొంత బాట ఏర్పాటు చేసుకోగలన్న విశ్వాసం, ధీమా విజయ్ లో వ్యక్తం అవుతున్నాయి.
అయితే తళపతి విజయ్ కు కోలీవుడ్ పరిశ్రమ మద్దతు ఏ మేరకు ఉంటుందన్న సందేమాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు తెలపడమే కాకుండా, పరోక్షంగా విజయ్ పై రాజకీయ విమర్శలు కూడా చేశారు. ఇక మరో హీరో కమల్ హసన్ విజయ్ కు మద్దతు ప్రకటిస్తారా అన్నిది కూడా అనుమానమే. ఇప్పటికే డీఎంకే మద్దతుతో రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఈ లోక్ నాయకుడు.. బహిరంగంగా విజయ్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు. వీరిద్దరినీ పక్కన పెడితే కోలీవుడ్ పరిశ్రమలో విజయ్ వెంట నిలిచేదెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. విజయ్ అభిమానులు మాత్రం తమిళ అగ్ర నటులంతా ముందుకు వచ్చి విజయ్ కు మద్దతు పలకాలని ఆశిస్తున్నారు. అయితే ప్రముఖ నటి త్రిష మాత్రం రాజకీయంగా తలపతి విజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించారని అంటున్నారు. ఇటీవల దుబాయ్ లో ఫెమా ఫంక్షన్ లో ఆమె రాజకీయంగా విజయ్ అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్టాఫ్ లక్ చెప్పారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ప్రముఖ స్థానంలో ఉన్న త్రిష సినీ కెరీర్ ఇప్పుడు కొద్దిగా నెమ్మదించింది. దీంతో సహజంగానే ఆమె తదుపరి అడుగు రాజకీయాలవైపు పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తలపతి విజయ్ కు ఏదో మామూలుగా బెస్టాఫ్ లక్ చెప్పలేదనీ, ముందు ముందు ఆమె తలపతి విజయ్ పార్టీ ద్వారానే రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందనీ అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/actor-trisha-to-join-tala[athy-vijay-party-39-205861.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.